మైనింగ్, ఏఐ-ఎంఎల్ల్లో యూజీ, పీజీ కోర్సులు
ఓయూ ఇంజినీరింగ్ కళాశాలలో మైనింగ్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లర్నింగ్ (ఏఐ అండ్ ఎంఎల్) విభాగాల్లో ఇటీవలే ప్రవేశపెట్టిన యూజీ, పీజీ కోర్సులకు ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ) అనుమతి లభించింది. ఈ మేరకు ఏఐసీటీఈ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే విద్యార్థులకు అందుబాటులో ఉన్న ఆరు డిగ్రీ కోర్సులు, 18 పోస్ట్గ్రాడ్యుయేట్ కోర్సుల అనుమతుల పొడిగింపునకు ఆమోదముద్ర వేసింది. కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేశ్ మాట్లాడుతూ ఈ గుర్తింపులో అధ్యాపకులు, ఉద్యోగులు, విద్యార్థుల పాత్ర కీలకమన్నారు వారందరకీ కృతజ్ఞతలు తెలిపారు. ఈసీఈ విభాగంలో యూజీ కోర్సులో విద్యార్థుల సంఖ్యను 50 నుంచి 60కి పెంచుకొనేందుకు అనుమతి లభించిందన్నారు. అదేవిధంగా, గేట్ అర్హత ఉన్న విద్యార్థులకు ఏఐసీటీఈ స్కాలర్షిప్ వచ్చేందుకు మార్గం సుగమమైందని ఆయన హర్షం వ్యక్తం చేశారు.
RELATED ARTICLES
Latest Updates
కణ బాహ్య జీర్ణక్రియ
అంతర్జాతీయ దినరేఖ ఏ జలసంధి గుండా పోతుంది?
ఒకే రకం భౌతిక లక్షణాలు.. సామాజిక సమూహాలు
గురుకులాలు.. ఉపాధికి మార్గాలు
CABE నివేదిక.. యుద్ధానంతర ప్రణాళిక
విస్తృత స్థాయిలో అంగీకారం, పార్టీల సంప్రదింపుల కోసం ఏర్పాటు చేసిన కమిటీ?
పలాసియోస్కు కిరీటం.. ‘తొలి తల్లి’ మిచెల్ కోన్
అయస్కాంత బలరేఖలు ఎక్కడ ప్రారంభమై ఎక్కడ అంతమవుతాయి?
పార్లమెంట్ సభ్యులు .. ప్రజలకు బాధ్యులు
తెలంగాణ జనసభ ఏ పేరుతో ర్యాలీలు, సదస్సులు నిర్వహించింది?