ఎస్టీ గురుకులాల్లో ఖాళీ సీట్లకు దరఖాస్తులు
– 6, 7, 8, 9 తరగతుల్లో ప్రవేశాలకు
– వచ్చే నెల 31న రాత పరీక్ష
సాంఘిక సంక్షేమ, గిరిజన గురుకులాల్లో 6, 7, 8, 9 తరగతుల్లో ఖాళీ సీట్ల భర్తీకి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని గురుకుల విద్యాలయ సంస్థల సొసైటీ కార్యదర్శి రోనాల్డ్ రోస్ ఆదివారం తెలిపారు. కరీంనగర్ జిల్లా అల్గునూర్, రంగారెడ్డి జిల్లా గౌలిదొడ్డిలోని సాంఘిక సంక్షేమ గురుకుల సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్లో 9వ తరగతిలో, వికారాబాద్ జిల్లా పరిగి, ఖమ్మంలోని గిరిజన సంక్షేమ గురుకుల స్కూల్ ఆఫ్ ఎక్స్లెన్స్లో 8వ తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతున్నట్టు పేర్కొన్నారు.
అర్హులైన అభ్యర్థులు సోమవారం నుంచి జూలై 7వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. జూలై 31న రాత పరీక్ష ఉంటుందని వెల్లడించారు. పాఠశాలలవారీగా ఖాళీల వివరాలను www.tswreis.ac.in, www.tgtwgurukulam.telangana.gov.in వెబ్సైట్లలో పెట్టినట్టు తెలిపారు.
RELATED ARTICLES
Latest Updates
కణ బాహ్య జీర్ణక్రియ
అంతర్జాతీయ దినరేఖ ఏ జలసంధి గుండా పోతుంది?
ఒకే రకం భౌతిక లక్షణాలు.. సామాజిక సమూహాలు
గురుకులాలు.. ఉపాధికి మార్గాలు
CABE నివేదిక.. యుద్ధానంతర ప్రణాళిక
విస్తృత స్థాయిలో అంగీకారం, పార్టీల సంప్రదింపుల కోసం ఏర్పాటు చేసిన కమిటీ?
పలాసియోస్కు కిరీటం.. ‘తొలి తల్లి’ మిచెల్ కోన్
అయస్కాంత బలరేఖలు ఎక్కడ ప్రారంభమై ఎక్కడ అంతమవుతాయి?
పార్లమెంట్ సభ్యులు .. ప్రజలకు బాధ్యులు
తెలంగాణ జనసభ ఏ పేరుతో ర్యాలీలు, సదస్సులు నిర్వహించింది?