‘వ్రతఖండ కల్పతరువు’ అనే గ్రంథ రచయిత?

రాచకొండ-దేవరకొండ వెలమల పరిపాలనా విధానం
వీరు పాలనావిధానంలో కాకతీయులను అనుసరించారు. వైదిక ధర్మ రక్షణ, ప్రజా శ్రేయస్సే తమ లక్ష్యాలుగా పాలించారు. వైదిక ధర్మాన్ని రక్షించడం కోసం, వర్ణ వ్యవస్థ కాపాడటం కోసం హేమాద్రి రచించిన ‘వ్రతఖండ కల్పతరువు’ అనే గ్రంథంలో వివరించిన పద్ధతుల ప్రకారం రాజ్య పరిపాలన చేశారు.పరిపాలనా వ్యవహారాల్లో రాజులకు ప్రధానమంత్రులు, పురోహితులు, సేనాధిపతులు సలహాలనిచ్చేవారు. వెలమ రాజులు తమ మంత్రివర్గంలో బ్రాహ్మణులను కూడా నియమించుకున్నారు. పెద్దన, పోతన, నాచన, సింగన, అయ్యలార్యుడు మొదలైన మంత్రుల పేర్లు నాటి శాసనాలు, సాహిత్యం ద్వారా తెలస్తుంది. మంత్రులు పురోహితులు, దేవారికులు కూడా తమ ప్రభువులతో పాటు యుద్ధాలకు వెళ్లేవారు. పరిపాలనలో యువరాజుకు ప్రత్యేక స్థానం ఉండేది. రాజులకు సంతానం లేకపోతే అతని కుమారులు చిన్నవారైనప్పుడు సోదరులు, సమీప బంధువులు రాజ్య భారం నిర్వహించేవారు.
పరిపాలనా వికేంద్రీకరణ
వెలమ నాయకులు పరిపాలనా సౌలభ్యం కోసం రాజ్యాన్ని ‘సీమలు’గా విభజించారు. సీమకు అధిపతులుగా రాజవంశస్థులను మాత్రమే నియమించేవారు. యువరాజులను కూడా దుర్గాధిపతులుగా నియమించేవారు.
దుర్గాధిపతులు, సామంతరాజులు, మండలాధీశులు తమ తమ ప్రాంతాల్లో పన్నులు వసూలు చేయడం, సైనిక రక్షణ ఏర్పాటు చేయడం, ప్రజాఉపయోగ కార్యక్రమాలు చేపట్టడం మొదలైనవి వారి విధులు.
దుర్గాలు
వీరి రాజ్యంలో రాచకొండ, దేవరకొండ, అనుముల, పొడిచేడు, ఆమనగల్లు, అనంతగిరి, ఉర్లుకొండ, ఉండ్రుగొండ, స్తంభగిరి, ఓరుగల్లు, భువనగిరి, జల్లిపల్లి, పానగల్లు మొదలైన దుర్గాలు ఉండేవి. వీరి కాలంలో నిరంతర యుద్ధాలు జరిగినందువల్ల వెలమ నాయకులు తమ రాజ్యంలో అనేక శత్రుదుర్భేద్యమైన దుర్గాలను నిర్మించారు.
దుర్గాలకు అధిపతులుగా ‘దుర్గాధ్యక్షులు’ ఉండేవారు. వీరు సైన్యాన్ని పోషించి పద్మనాయకులకు యుద్ధాల్లో తోడ్పడేవారు. యుద్ధ సమయాల్లో దుర్గంలో ఆహార ధాన్యాలు నిల్వ ఉంచేవారు. అందుకోసం ప్రత్యేకంగా పాతరలు నిర్మించారు. ఆయుధగారాలను కూడా నిర్మించారు.
గ్రామపరిపాలన
గ్రామ పరిపాలన కాకతీయుల పాలనను పోలి ఉండేది. గ్రామంలో ద్వాదశ వృత్తులవారు ఉండేవారు. వీరిలో కరణం, తలారి గ్రామ ముఖ్య ఉద్యోగులు. వీరు గ్రామ రక్షణ, పన్నుల వసూలు మొదలైన విధులను నిర్వహించేవారు.
న్యాయపాలన
రాజ్యంలో తీర్పులు చెప్పడానికి ధర్మాసనాలు ఉండేవి. శిక్షలు కఠినంగా ఉండేవి. దివ్య పరీక్షల ద్వారా నేరారోపణ చేసేవారు. లింగవిచ్ఛేదం, గానుగలో తల ఆడించడం, గుండెలపై పెద్దబండలను ఎత్తడం, గడ్డిని శరీరానికి చుట్టి నిప్పంటించడం, ఎండలో నిలబెట్టి పొగ దండలు వేయడం, కొరడాతో కొట్టించడం వంటివి శిక్షలుగా ఉండేవి. బ్రాహ్మణులు మరణదండన విధించతగ్గ తప్పు చేస్తే వారిని చంపకుండా వారి ముఖాలపై కుక్క పాదాన్ని ముద్రించి గాడిదపై ఊరేగించేవారు.
పన్నులు
రాజ్యానికి భూమిశిస్తు ప్రధాన ఆదాయం. పంటలో 1/6వ వంతు శిస్తుగా వసూలు చేసేవారు. బ్రాహ్మణ అగ్రహారాలకు పన్ను మినహాయింపు ఉండేది. వ్యాపార సుంకాలు, వృత్తి పన్నులు ఇతర ఆదాయాలుగా వచ్చేవి. పద్మనాయకులు పక్క రాజ్యాలైన విజయనగర, రెడ్డి, గజపతులు, బహమనీ సుల్తానులతో నిరంతర యుద్ధాలు చేయడంవల్ల ప్రజలపై పన్నుల భారం ఎక్కువగా పడేది. చన్నులపై వేసిన చంటిపన్ను లాంటివి ఇందుకు నిదర్శనం. దండయాత్రలు చేసి శత్రురాజ్యాలను దోచుకునేవారు. అది కూడా రాజ్యానికి ఆదాయంగా ఉండేది.
ఆర్థిక పరిస్థితులు
వ్యవసాయం: వెలమ రాజుల కాలంలో కాకతీయుల ఆర్థిక పరిస్థితులే కొనసాగాయి. వ్యవసాయం నాడు రాజ్యంలోని ప్రజలకు ప్రధాన వృత్తి. అదే ఆర్థిక వ్యవస్థకు ప్రధాన ఆదాయం. ఆ కాలంలో కూడా భూ యాజమాన్యం నాలుగు రకాలుగా ఉండేది. 1) రైతుల భూములు, 2) గ్రామ భూమి, 3) దేవాలయాలు, మఠాలు, ధర్మ సంస్థలు, వృత్తి మాన్యాలు, అగ్రహార భూములు, 4) రాజులు-వారి సామంతుల భూములు అని ఉండేవని చారిత్రక ఆధారాలు తెలుపుతున్నాయి.
రైతులు సాగుచేసుకొనే భూమిపై వారికి సంపూర్ణ హక్కులు ఉండేవి. వారు భూములు అమ్ముకోవడానికి, ఇతరులకు దానం చేయడానికి అధికారం ఉండేది. గ్రామాల్లో రైతులు, దేవాలయాల భూములు పోను మిగిలిన భూమి అంతా గ్రామానికి చెందుతుంది. అది గ్రామసమితి అధికారం కింద ఉంటుంది. ఒకవేళ ఆ భూమిని అమ్మాలన్నా, దేవాలయాలకు దానంగా ఇవ్వాలన్నా గ్రామసమితి ఇష్టంపై ఆధారపడి ఉండేది. ఒక్కొక్కప్పుడు రైతులతో ఈ భూమిని సాగుచేయించేవారు. సాగువల్ల వచ్చిన ఆదాయం గ్రామసమితికి చెందుతుంది. ఈ ఆదాయాన్ని సమితి గ్రామాభివృద్ధికి వినియోగించేవారు.
అగ్రహార భూములపై పన్నులు ఉండవు. దానిపై వచ్చే ఆదాయం బ్రాహ్మణులకు పోతుంది. అగ్రహారాల్లో అంతా బ్రాహ్మణులే ఉంటారు. కాబట్టి అగ్రహార భూములు సాగుచేసేందుకు అనుబంధంగా శివారు గ్రామాలుండేవి. అందులో రైతులు, ఇతర పనివారు నివసిస్తూ అగ్రహార భూములను సాగుచేసి పంటలు పండించేవారు. అగ్రహారికులు వారికి పంటలో భాగం ఇచ్చేవారు.
దేవాలయ భూములకు పన్నులు ఉండేవి కావు. ఆ భూములను రైతులకు కౌలుకు ఇచ్చేవారు.
నీటిపారుదల సౌకర్యాలు
వెలమ రాజులు వ్యవసాయాన్ని అభివృద్ధి చేసే క్రమంలో నీటిపారుదల సౌకర్యాలను కూడా వృద్ధి చేశారు. మొదటి అనపోతానాయుడు ‘అనపోత సముద్రాన్ని’, రావు మాధవనాయుని భార్య నాగాంబిక ‘నాగ సముద్రాన్ని’, రెండో అనపోతానాయుడు రాయసముద్రాన్ని నిర్మించారు. ఇవేకాకుండా పర్వతరావు తటాకం, వేదగిరి తటాకం, మాధవరావు చెరువు మొదలైనవి కూడా ఈ కాలంలో నిర్మించారు. చెరువులు, తటాకాలే కాకుండా బావులు, కాల్వలు కూడా తవ్వించి వ్యవసాయాన్ని ప్రోత్సహించారు. ఏతాము, రాట్నాల ద్వారా కూడా పొలాలకు నీటి వసతి కల్పించుకొనేవారు. ఆనాడు మూడు రకాల వ్యవసాయ భూములు ఉండేవి.
1) మెట్ట 2) తరి 3) తోటభూములు.
విస్తీర్ణంలో మెట్ట భూములు ఎక్కువ. ఇవి వర్షాధారమైనవి. తరి, సాగుభూములు మంచి సారవంతమైనవి. అందువల్ల వరి విస్తారంగా పండించేవారు. నాడు సంవత్సరానికి రెండు పంటలు పండేవి. వైశాఖ మాసంలో ఒక పంట, కార్తీక మాసంలో రెండో పంటను పండిచేవారు. ప్రతి గ్రామంలో శిస్తుగా వసూలు చేసిన ధాన్యాన్ని నిల్వ చేయడానికి రాచగాదెలు ఉండేవి. వ్యవసాయానికి పనికివచ్చే పనిముట్లు కమ్మరులు, కంసాలులు తయారుచేసేవారు.
పంటలు
ఈ కాలంలో ప్రజలు పలు రకాల పంటలు పండించేవారు. ముఖ్యంగా వరి ప్రధానమైనది. దీన్ని రాజ్యంలో ఎక్కువ విస్తీర్ణంలో పండించేవారు. దీనిలో ‘కలమ, శాలి, శిరాముఖి, పతంగహోయన’ అనే రకాలు ముఖ్యమైనవి. మెట్టపంటలు జొన్నలు, సజ్జలు, రాగులు, పప్పుధాన్యాలు పండించేవారు.
కొబ్బరి, అరటి, పనస, పోక, చెరకు మొదలైన తోటలను కూడా పండించినట్లు చారిత్రక ఆధారాలు పేర్కొంటున్నాయి. ఈ యుగంలో సాధారణ ప్రజలతో పాటు ఉద్యోగాలు దొరకని బ్రాహ్మణులు కూడా వ్యవసాయాన్ని చేశారు. అట్టి వారిలో బమ్మెర పోతన ముఖ్యుడు.
పశుపోషణ
వ్యవసాయం తరువాత ముఖ్యమైన వృత్తి పశుపోషణ. రైతులే గాక రాజులు, సామంతులు కూడా పశువులను పోషించారు. దేవాలయాలు కూడా పశువులను పోషించాయి. ప్రతి దేవాలయానికి ‘కిలారులు’ అనే పేరుతో పశుశాలలు ఉండేవి. బ్రాహ్మణులు కూడా పశువులను పోషించారు. ముఖ్యంగా గోవులను వారు ఎక్కువగా పోషించారు.
పరిశ్రమలు
వీరి కాలంలో తెలంగాణలో అనేక రకాలైన పరిశ్రమలు అభివృద్ధిలో ఉండేవి. ప్రధాన పరిశ్రమ వస్త్రపరిశ్రమ. ఓరుగల్లు, రాచకొండ, దేవరకొండలు వస్త్రపరిశ్రమకు ఆనాడు ప్రసిద్ధిచెందాయి. దీంతోపాటు కలంకారీ, అద్దకపు పరిశ్రమ కూడా అభివృద్ధి చెందింది. చీరలపైన, అంచులపైన రాజ హంసలు, లేళ్లు, గుర్రాలు, ఏనుగులు, నెమలి పింఛాలు, రాజఖడ్గాలు, ఢమరుకాలు మొదలైనవి చిత్రించుకొనేవారు. కొన్ని చీరలను రామ సింగారం, వసంత సింగారం, రామ విలాసం, వసంత విలాసం, శ్రీకృష్ణ విలాసం అనే పేర్లతో పిలిచేవారు. హేమ పట్టు, వజ్ర పట్టు, పులిగోరు పట్టు, ఉదయ పట్టు, వెలపట్టు వంటి మొదలైన రకాల పట్టుచీరలు కూడా ఉన్నట్లు ‘సింహాసన ద్వాత్రింశిక’ పేర్కొంటుంది.
వస్త్ర పరిశ్రమలకు అనుబంధంగా రంగుల పరిశ్రమలు కూడా వెలుగొందాయి. ముఖ్యంగా నీలి రంగు తయారీ ప్రతి ఇంట్లో ఉండేది. రత్న కంబళ్లు, తివాచీల నేత కూడా పేరొందింది. గ్రామాల్లో స్త్రీలు రాట్నాలపై నూలు వడికేవారు. పంచానం వారు గంటలు, స్తంభాలు, చీలికెలు తయారుచేసేవారు. వంటపాత్రలు, పంచలోహాలతో గజ గంటలు, జయస్తంభాలు, దీపస్తంభాలు, దేవతా విగ్రహాలు, వ్యవసాయ పరికరాలు, స్త్రీలకు బంగారు, వెండి ఆభరణాలను కూడా పంచానం వారు తయారుచేసేవారు. ఆనాడు గాజులు, అద్దాల పరిశ్రమలు కూడా ఉండేవి. గాజు రెక్కల ప్రస్తావన సాహిత్యంలో ఉంది. కాగితం వాడుకలోకి వచ్చింది. ఆయుధాల పరిశ్రమలు కూడా అభివృద్ధిలో ఉన్నాయి. నిర్మల్ ఉక్కు కత్తులు గొప్ప పేరొందాయి. దంతపు పరిశ్రమ కూడా అమల్లో ఉన్నట్లు ‘రుక్మాంగద చరిత్ర’లో వివరించి ఉంది.
వర్తక-వ్యాపారం
వీరి కాలంలో బలిజలు, వైశ్యులు విదేశీ వ్యాపారం చేసేవారు. సుగంధ ద్రవ్యాలు, పట్టుబట్టలు దిగుమతి చేసుకొనేవారు. కృష్ణాతీరంలోని వాడపల్లి వీరి నౌకా కేంద్రం. వాడపల్లిపై ఆధిపత్యం కోసం వెలమ రాజులకు-రెడ్డి రాజులకు తరుచూ ఘర్షణలు జరుగుతుండేవి. కాకతీయుల కాలంలో ఉన్న నాణేలు, తూకాలు, కొలతలు అమల్లో ఉన్నాయి. పుణ్యక్షేత్రాల్లో పండుగలకు, జాతరలకు సంతలు జరిగేవి. వారాంతపు సంతలు కూడా ఉండేవి.
సామాజిక పరిస్థితులు
వర్ణవ్యవస్థ: వెలమ నాయకుల పరిపాలనా కాలం నాటికి సామాజిక పరిస్థితుల్లో కొంత మార్పు వచ్చింది. ముస్లింల దండయాత్రల వల్ల బ్రాహ్మణులు కులవృత్తికి దూరమయ్యారు. రాజాస్థానాల్లో ఉద్యోగాల కోసం ప్రయత్నించారు. ఉద్యోగాలు లభించనివారు వ్యవసాయాన్ని కూడా చేశారు. బ్రాహ్మణుల్లో వైదిక, నియోగి అనే శాఖలు ఏర్పడ్డాయి.
ఈ కాలంలో క్షత్రియ కులం ఉన్నట్లు ఆధారాలు లేవు. చాళుక్య వంశాలు అక్కడక్కడా ఉన్నాయి. కానీ వారు తమ కుల స్వచ్ఛతని కాపాడుకోలేదు. శూద్ర కులాలైన రెడ్డి, వెలమ, కమ్మ కులాల ప్రభావం పెరిగింది. వీరు రాజ్య స్థాపకులై పాలక కుటుంబాలుగా మారారు. అందువల్ల ఈ కులాలు ఒకరిపై ఒకరు ఈర్ష్యాద్వేషాలు పెంచుకొన్నారు. మిగిలిన శూద్రకులాలు ఎవరి వృత్తిని వారు కొనసాగించారు. వైశ్యులు, బలిజలు సంప్రదాయకమైన వ్యాపారాన్ని కొనసాగించారు.
ప్రజల్లో మూఢనమ్మకాలు ఉండేవి. శకునాల పట్ల అమిత నమ్మకం ఉండేది. పంచాంగం వాడుకలో ఉంది. పంచాంగం చూసి ముహూర్తాలు పెట్టించుకొని ప్రతి పని చేసేవారు. రాజులు కూడా ముహూర్తాలు నిర్ణయించుకొని యుద్ధాలు ప్రకటించేవారు.
వినోదాలు
గ్రామాల్లో కోలాటాలు, భజనలు, దేవాలయాల్లో జరిగే ఉత్సవాలు, కోళ్ల పందెం, మేకల, పొట్టేళ్ల పందెం, వీధి నాటకాలు, పురాణ శ్రవణం, గచ్చకాయల ఆటలు, పులి జూదాలు నాటి ప్రజలకు వినోదాలు.
సాసాల మల్లికార్జున్
అసిస్టెంట్ ప్రొఫెసర్
ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, కోరుట్ల
9492 575 006
- Tags
Latest Updates
Aruba Bet : guide complet de la plateforme pour les joueurs français
Winbeatz casino : une lecture neutre du signup et du profil — focus paiements
Betriviera : dépôts, paiements et gestion de la caisse
Only Spins et la différence entre jackpots fixes et progressifs : repères avant de commencer
Corgibet : méthodes, limites et règles de retrait
Spinbit Fresh Bonus Guide Highlights New Zealand
Corgibet casino et la vérification expliquée du profil au paiement — examen des preuves et restrictions
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు






