ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా మిజోరం రాష్ట్రం ఏర్పడింది?
- (డిసెంబర్ 1వ తేదీ తరువాయి)
31. మొదటి రాష్ర్టాల పునర్వ్యవస్థీకరణ కమిషన్లో చైర్మన్/సభ్యులకు సంబంధించి సరైన జవాబును గుర్తించండి?
1) ఫజల్ అలీ
2) హృదయ్ నాథ్ కుంజ్రూ
3) కె.ఎం. ఫణిక్కర్ 4) హెచ్.కె. పటేల్
32. 1955 సెప్టెంబర్లో కేంద్ర ప్రభుత్వానికి నివేదికను సమర్పించిన మొదటి రాష్ర్టాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ సిఫారసుల్లో సరైన జవాబును గుర్తించండి?
ఎ) ఒకే రాష్ట్రం ఒకే భాష అనే వాదన
సరైంది కాదు
బి) పార్ట్ ఎ, బి, సి, డి రాష్ర్టాల
వర్గీకరణను రద్దు చేయాలి
సి) దేశాన్ని 12 రాష్ర్టాలు, 9 కేంద్రపాలిత ప్రాతాలుగా వర్గీకరించాలి.
డి) జాతీయ మైనార్టీ భాషల కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలి.
1) ఎ, బి, సి,డి 2) ఎ, బి, సి
3) ఎ, బి, డి 4) ఎ, సి, డి
33. ఫజల్ అలీ కమిషన్ సిఫార్సుల మేరకు జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వం మొదటి రాష్ర్టాల పునర్ వ్యవస్థీకరణ చట్టాన్ని ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రూపొందించింది?
1) 6వ రాజ్యాంగ సవరణ చట్టం , 1955
2) 7వ రాజ్యాంగ సవరణ చట్టం, 1956
3) 8వ రాజ్యాంగ సవరణ చట్టం 1957
4) 9వ రాజ్యాంగ సవరణ చట్టం 1957
34. మొదటి రాష్ర్టాల పునర్వ్యవస్థీకరణ చట్టంలోని అంశాలకు సంబంధించి సరైన జవాబును గుర్తించండి?
ఎ) ఈ చట్టం 1956, నవంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చింది
బి) రాజ్యాంగంలోని 7వ భాగం నూతనంగా ఏర్పాటు చేశారు.
సి) భారతదేశాన్ని 14 రాష్ర్టాలు, 6 కేంద్ర పాలిత ప్రాంతాలగా వర్గీకరించారు,
డి) భారతదేశాన్ని పరిపాలనా సౌలభ్యం కోసం 5 ప్రాంతీయ మండళ్లుగా ఏర్పాటు చేశారు.
1) ఎ, సి, డి 2) ఎ, బి, సి
3) బి, సి, డి 4) ఎ, బి, సి, డి
35. ఆంధ్ర, తెలంగాణ నాయకుల మధ్య ఢిల్లీలో పెద్ద మనుషుల ఒప్పందం ఎప్పుడు జరిగింది?
1) 1955 ఫిబ్రవరి 20
2) 1956 ఫిబ్రవరి 20
3) 1955 జనవరి 20
4) 1954 ఫిబ్రవరి 26
36. 1956లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటు విషయమై హైదరాబాద్ శాసనసభలో జరిగిన ఓటింగ్నకు సంబంధించి సరైన జవాబును గుర్తించండి?
ఎ) 103 మంది శాసనసభ్యులు
అనుకూలంగా ఓటు వేశారు.
బి) 29 మంది సభ్యులు వ్యతిరేకంగా
ఓటు వేశారు.
సి) 31 మంది శాసన సభ్యులు
సమావేశాలను బహిష్కరించారు.
డి) 15 మంది శాసనసభ్యులు తటస్థంగా వ్యవహరించారు.
1) ఎ, బి, సి 2) ఎ, బి, సి, డి
3) బి, సి, డి 4) ఎ, బి, డి
37. పెద్ద మనుషుల ఒప్పందంలోని సరైన జవాబును గుర్తించండి?
ఎ) ఆంధ్రాకు చెందిన వ్యక్తి ముఖ్యమంత్రి అయినప్పుడు తెలంగాణకు చెందిన వ్యక్తికి ఉపముఖ్యమంత్రి పదవిని ఇవ్వాలి.
బి) తెలంగాణకు చెందిన వ్యక్తి ముఖ్యమంత్రి అయినపుడు ఆంధ్రాకు చెందిన వ్యక్తి
ఉపముఖ్యమంత్రి పదవిని కేటాయించాలి.
సి) ప్రత్యేక ఆంధ్రా ప్రాంతీయ బోర్డును ఏర్పాటు చేయాలి.
డి) హైదరాబాద్ ప్రాంతంలో వచ్చే
ఆదాయాన్ని తెలంగాణ ప్రాంత అభివృద్ధికే కేటాయించాలి.
1) ఎ, బి, సి 2) ఎ, సి, డి
3) ఎ, బి, డి 4) బి, సి, డి
38. రాష్ర్టాల పునర్వ్యస్థీకరణ చట్టం, 1956 ద్వారా ఏర్పడిన రాష్ర్టాలకు సంబంధించి సరికాని దాన్ని గుర్తించండి?
1) అస్సాం, బెంగాల్, బీహార్, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్
2) మద్రాస్, కేరళ, మైసూర్, బొంబాయి, రాజస్థాన్
3) హిమాచల్ప్రదేశ్, అరుణాచల్ప్రదేశ్, మణిపూర్, త్రిపుర
4) ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, పంజాబ్, జమ్ముకశ్మీర్
39. రాష్ర్టాల పునర్వ్యవస్థీకరణ చట్టం, 1956 ద్వారా ఏర్పడిన కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించి సరికాని దాన్ని గుర్తించండి.
1) హిమాచల్ ప్రదేశ్, త్రిపుర
2) డామన్డయ్యూ, దాద్రానగర్ హవేలి
3) ఢిల్లీ, మణిపూర్, అండమాన్,
నికోబార్ దీవులు
4) అమోని, మినికాయ్, లాక్ దీవులు
40. కింద పేర్కొన్న అంశాల్లో సరైన జవాబును గుర్తించండి?
ఎ) 1960 మే 1న బొంబాయి రాష్ర్టాన్ని
విభజించారు
బి) గుజరాత్ భాష మాట్లాడే వారి కోసం సౌరాష్ట్రను కలుపుతూఊ 15వ రాష్ట్రంగా
‘గుజరాత్’ను ఏర్పాటు చేశారు.
సి) మరాఠా భాష మాట్లాడే వారితో గల బొంబాయిని మహారాష్ట్రగా ఏర్పాటు చేశారు.
డి) అహ్మాదాబాద్కు ప్రత్యేక
స్వయం ప్రతిపత్తిని కల్పించారు.
1) ఎ, బి, సి 2) ఎ, బి, సి, డి
3) ఎ, బి, డి 4) ఎ, సి, డి
41. నాగాలాండ్ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి సరైన జవాబును గుర్తించండి?
ఎ) నాగాలు తమ నాయకుడైన ఏజీపీ జో
నేతృత్వంలో ప్రత్యేక రాష్ట్రం కోసం
ఉద్యమించారు.
బి) 1962లో అస్సాం పరిధిలో ఉన్న
నాగాలకు సహరాష్ట్ర ప్రతిపత్తిని
కల్పించినప్పటికి నాగాలు సంతృప్తి చెందలేదు.
సి) 1963 డిసెంబర్ 1న అస్సాం రాష్ర్టాన్ని పునర్ వ్యవస్థీకరించారు.
డి) నాగాలాండ్ను భారత్లో 16వ రాష్ట్రంగా ఏర్పాటు చేశారు.
1) ఎ, బి, సి 2) ఎ, బి, సి, డి
3) ఎ, బి, డి 4) ఎ, సి, డి
42. పంజాబ్ రాష్ట్రం పంజాబీయులకే (సిక్కులు) చెందాలనే ఉద్యమం ఎవరి నేతృత్వంలో జరిగింది?
1) మాస్టర్ తారాసింగ్, సంత్ఫతేసింగ్
2) అమరీందర్ చౌహాన్
3) గురుదయాళ్సింగ్, సంత్ఫతేసింగ్
4) సోనో అధర్ వాలా
43. హర్యానా రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి కింది వాటిలో సరైన జవాబును గుర్తించండి?
ఎ) 1966లో పంజాబ్ రాష్ర్టాన్ని
పునర్వ్యవస్థీకరించాలి
బి) షా కమిషన్ సిఫార్సుల మేరకు హిందీ మాట్లాడే వారికోసం హర్యానా రాష్ర్టాన్ని 1966 నవంబర్ 1న ఏర్పాటు చేశారు.
సి) పంజాబ్కు చెందిన కొండ ప్రాంతాలను హిమాచల్ప్రదేశ్లో కలిపారు.
డి) భారత్లో 19వ రాష్ట్రంగా హర్యానా
అవతరించింది.
1) ఎ, బి, సి, డి 2) ఎ, సి, డి
3) ఎ, బి, సి 4) బి, సి, డి
44. హిమాచల్ ప్రదేశ్కు సంబంధించి కింది వాటిలో సరైన జవాబును గుర్తించండి?
ఎ) 1956లో కేంద్ర పాలిత ప్రాంతంగా ఏర్పాటు చేశారు.
బి) 1971లో బిలాస్పూర్ ప్రాంతాన్ని హిమాచల్ప్రదేశ్కి కలిపి హిమాచల్ప్రదేశ్గా రాష్ట్రంగా ఏర్పాటు చేశారు.
సి) 1971 జనవరి 25న భారత్లో 18వ రాష్ట్రంగా హిమాచల్ప్రదేశ్ అవతరించింది.
డి) 1979లో హిమాచల్ప్రదేశ్
పునర్వ్యవస్థీకరణకు గురైంది.
ఎ) ఎ, బి, సి, డి బి) ఎ, బి, సి
సి) బి, సి, డి డి) ఎ, సి, డి
45. కింది పేర్కొన్న అంశాల్లో సరైన జవాబును గుర్తించండి?
1) భారత్లో 19వ రాష్ట్రంగా మణిపూర్
ఏర్పడింది
2) 1972 జనవరి 21న మణిపూర్ రాష్ట్రం ఏర్పడింది
3) 1956లో మణిపూర్ కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పడింది
4) మణిపూర్ నుంచి 1987లో అరుణాచల్ ప్రదేశ్ను వేరు చేశారు.
46. కింద పేర్కొన్న అంశాల్లో సరైన జవాబును గుర్తించండి?
ఎ) భారత్లో 20వ రాష్ట్రంగా త్రిపుర ఏర్పడినది
బి) అస్సాం రాష్ర్టాన్ని పునర్వ్యవస్థీకరించి కొంతభాగాన్ని వేరు చేసి మేఘాలయ రాష్ట్రంగా ఏర్పాటు చేశారు.
సి) మేఘాలయ రాష్ట్రం 1972, జనవరి 1న భారత్లో 21వ రాష్ట్రంగా ఏర్పాటు చేశారు.
డి) మేఘాలయకు 1977 వరకు సహరాష్ట్ర హోదా లభించినది
1) ఎ, బి, డి 2) ఎ, సి, డి
3) ఎ, బి, సి, డి 4) ఎ, బి, సి
47. రాజీవ్గాంధీ ప్రభుత్వం ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా భారత్లో 23వ రాష్ట్రంగా మిజోరంను ఏర్పాటు చేయడం జరిగింది?
1) 52వ రాజ్యాంగ సవరణ చట్టం 1985
2) 53వ రాజ్యాంగ సవరణ చట్టం 1987
3) 54వ రాజ్యాంగ సవరణ చట్టం 1988
4) 56వ రాజ్యాంగ సవరణ చట్టం 1988
48. రాజీవ్గాంధీ ప్రభుత్వం ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా అరుణాచల్ ప్రదేశ్ను భారత్లో 24వ రాష్ట్రంగా ఏర్పాటు చేసింది?
1) 53వ రాజ్యాంగ సవరణ చట్టం 1987
2) 54వ రాజ్యాంగ సవరణ చట్టం 1987
3) 55వ రాజ్యాంగ సవరణ చట్టం 1987
4) 59వ రాజ్యాంగ సవరణ చట్టం 1988
49. కింది పేర్కొన్న అంశాల్లో సరైన జవాబును గుర్తించండి?
ఎ) 1961 ఆపరేషన్ విజయ్’ ద్వారా పోర్చుగీసు వారి నుంచి గోవా, డామన్ డయ్యూలను భారత్లో విలీనం చేశారు.
బి) 10వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా గోవా డామన్, డయ్యూలను కేంద్ర పాలిత ప్రాంతంగా ఏర్పాటు చేశారు.
సి) రాజీవ్గాంధీ ప్రభుత్వం 56వ రాజ్యాంగ సవరణ చట్టం, 1987 ద్వారా గోవాను రాష్ట్రంగా ఏర్పాటు చేసినది.
డి) రాజీవ్గాంధీ ప్రభుత్వం డామన్, డయ్యూలను కేంద్ర పాలిత ప్రాంతంగా
కొనసాగించినది.
1) ఎ, బి, సి 2) ఎ, బి, సి, డి
3) ఎ, బి, డి 4) ఎ, సి, డి
50. కింద అంశాల్లో సరైన జవాబును గుర్తించండి?
ఎ) మధ్యప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం ద్వారా భారత్లో 26వ రాష్ట్రంగా
ఛత్తీస్గఢ్ అవతరించినది.
బి) ఉత్తరప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం ద్వారా భారత్లో 27వ రాష్ట్రంగా
ఉత్తరాంచల్ అవతరించింది.
సి) బీహార్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం ద్వారా భారత్లో 28వ రాష్ట్రంగా జార్ఖండ్ అవతరించింది.
1) ఎ, బి 2) ఎ, సి
3) బి, సి 4) ఎ, బి, సి
51. వివిధ రాష్ర్టాలు అవి ఏర్పడిన తేదీలకు సంబంధించి సరైన జవాబును గుర్తించండి?
ఎ) ఉత్తరాంచల్ 1) 2000 నవంబర్ 1
బి) జార్ఖండ్ 2) 2000 నవంబర్ 9
సి) ఛత్తీస్గఢ్ 3) 2000 నవంబర్ 15
1) ఎ-2, బి-3, సి-1
2) ఎ-2, బి-1, సి-3
3) ఎ-1. బి-2, సి-3
4) ఎ-3, బి-2, సి-1
52. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియకు సంబంధించి కిందివాటిలో సరైన జవాబును గుర్తించండి?
ఎ) ఎ) 2009 నవంబర్ 29న కేసీఆర్
ఆమరణ నిరాహార దీక్ష.
బి) 2009 డిసెంబర్ 9- తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు కేంద్ర మంత్రి పి. చిదంబరం ప్రకటన.
సి) 2010 ఫిబ్రవరి 9- తెలంగాణ అంశంపై అధ్యయనం కోసం జస్టిస్ బీఎన్ శ్రీకృష్ణ కమిటీ ఏర్పాటు.
డి) 2013 డిసెంబర్ 30 జస్టిస్ బీఎన్. శ్రీకృష్ణ కమిటీ నివేదిక సమర్పణ.
1) ఎ, బి, డి 2) ఎ, సి, డి
3) ఎ, బి, సి 4) ఎ, బి, సి, డి
53. కింద పేర్కొన్న అంశాల్లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియకు సంబంధించి సరైన జవాబును గుర్తించండి?
ఎ) 2013 అక్టోబర్ 3 తెలంగాణ బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం
2) 2013 అక్టోబర్ 4 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర
విభజన కోసం గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఏర్పాటు
3) 2013 డిసెంబర్ 13న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఉద్దేశించిన బిల్లు ప్రతులను రాష్ట్రపతి శాసనసభకు పంపడం
4) 2014 జనవరి 30 ఆంధ్రప్రదేశ్ శాసనసభలో తెలంగాణ బిల్లుపై చర్చ, మూజువాణి ఓటుతో బిల్లు ఆమోదం
1) ఎ, సి, డి 2) ఎ, బి, సి
3) ఎ, బి, సి, డి 4) ఎ, బి, డి
54. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియకు సంబంధించిన అంశాల్లో సరైన జవాబును గుర్తించండి?
ఎ) 2014 ఫిబ్రవరి 13 లోక్సభలో
తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టారు
బి) 2014 ఫిబ్రవరి 18 తెలంగాణ బిల్లుకు లోక్సభ ఆమోదం
సి) 2014 ఫిబ్రవరి 20 తెలంగాణ బిల్లుకు రాజ్యసభ ఆమోదం
డి) 2014 ఫిబ్రవరి 26 తెలంగాణ బిల్లును ఉద్దేశించి రాష్ట్రపతి చివరి ప్రసంగం
1) ఎ, బి, సి, డి 2) ఎ, సి, డి
3) ఎ, బి, సి 4) ఎ, బి, డి
55. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లుకు రాష్ట్రపతి ఎప్పుడు ఆమోద ముద్ర వేశారు?
1) 2014 ఫిబ్రవరి 28
2) 2014 మార్చి 1
3) 2014 మార్చి 2 4) 2014 మార్చి 3
56. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించిన గెజిట్ను భారత ప్రభుత్వం ఎప్పుడు జారీ చేసింది?
1) 2014, మార్చి 4 2) 2014 మార్చి 8
3) 2014 మే, 31 4) 2014 జూన్ 2
57. జస్టిస్ బి.ఎన్. శ్రీకృష్ణ ఆధ్వర్యంలో ఏర్పడిన కమిటీలో సభ్యులు కానిది ఎవరు?
1) ప్రొ. రణబీర్ సింగ్
2) డా. అబూసవే షరీఫ్
3) ప్రొ. రవీంద్రకౌర్ 4) డా. వినోద్ మిశ్రా
58. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణపై అధ్యయనం చేసిన జస్టిస్ బి.ఎన్. శ్రీకృష్ణ కమిటీకి సంబంధించిన అంశాల్లో సరైన జవాబును గుర్తించండి?
ఎ) ఈ కమిటీ తన నిదేదికను 2010
డిసెంబర్ 30న రాష్ట్రపతికి సమర్పించింది
బి) ఈ కమిటీకి సభ్యకార్యదర్శిగా వినోద్ కుమార్ దుగ్గల్ వ్యవహరించారు.
సి) ఈ కమిటీ ప్రధానంగా 6
సిఫారసులను చేసింది.
డి) ఈ కమిటీ తాను చేసిన సిఫార్సుల్లో
6వ అంశానికి తమ ప్రథమ ప్రాధాన్యమని
పేర్కొన్నది.
1) ఎ, బి, సి 2) ఎ, బి, డి
3) ఎ, సి, డి 4) బి, సి, డి
59. ప్రాంతీయ మండలికి సంబంధించి సరైన జవాబును గుర్తించండి?
ఎ) ప్రస్తుతం దేశంలో గల ప్రాంతీయ మండళ్ల సంఖ్య-6
బి) ప్రాంతీయ మండలి సమావేశాలకు కేంద్ర హోంమంత్రి అధ్యక్షత వహిస్తారు
సి) ఇందిరాగాంధీ ప్రభుత్వం 1971లో ఈశాన్య రాష్ర్టాల ప్రాంతీయ మండలిని ఏర్పాటు చేశారు
డి) ఈ శాన్య రాష్ర్టాల ప్రాంతీయ మండలి 1975 నుంచి అమల్లోకి వచ్చింది
1) ఎ, బి, సి 2) ఎ, సి, డి
3) ఎ, బి, సి, డి 4) ఎ, బి, డి

- Tags
- constitution
- Geography
- India
- nipuna
Latest Updates
Aruba Bet : guide complet de la plateforme pour les joueurs français
Winbeatz casino : une lecture neutre du signup et du profil — focus paiements
Betriviera : dépôts, paiements et gestion de la caisse
Only Spins et la différence entre jackpots fixes et progressifs : repères avant de commencer
Corgibet : méthodes, limites et règles de retrait
Spinbit Fresh Bonus Guide Highlights New Zealand
Corgibet casino et la vérification expliquée du profil au paiement — examen des preuves et restrictions
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు






