మరో 532 టీచర్ల పరస్పర బదిలీలు

– జీరో సర్వీస్ అండర్టేకెన్ ఇచ్చిన వారికే..
– జీవో విడుదల చేసిన విద్యాశాఖ
పాఠశాల విద్యాశాఖలో మరికొందరు ఉపాధ్యాయుల పరస్పర బదిలీలు (మ్యూచువల్ ట్రాన్స్ఫర్స్)కు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. రాష్ట్రంలోని 532 టీచర్లను సోమవారం బదిలీచేసింది. విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ సోమవారం ఇందుకు సంబంధించిన జీవో-17ను జారీచేశారు. పరస్పర బదిలీల్లో ఇద్దరు పరస్పరం ఒకచోటి నుంచి మరోచోటికి బదిలీ కావాల్సి ఉండగా, సోమవారం 266 దరఖాస్తులను పరిష్కరించి మొత్తం 532 టీచర్లను బదిలీచేశారు. తాజాగా బదిలీ అయిన వారు పాత సర్వీసును కోల్పోతారని, వీరంతా జిల్లాలో రెగ్యులర్ టీచర్ల తర్వాత చివరి ర్యాంక్లో ఉండాల్సి ఉంటుందని ఆయా జీవోలో స్పష్టంచేశారు. తాజాగా బదిలీ అయిన 532 టీచర్లు జీరో సర్వీస్కు అంగీకారం తెలపడంతోనే వీరిని ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు బదిలీచేశారు. ఇప్పటికే జూన్ 20న 2,538 మంది టీచర్లు, ఉద్యోగులను పరస్పరం బదిలీచేయగా, తాజాగా మరో 532 మందిని బదిలీచేస్తూ ఉత్తర్వులు జారీచేశారు.
జిల్లాల వారిగా బదిలీలు
జిల్లా బదిలీలు
ఖమ్మం 24
హనుమకొండ 32
వికారాబాద్ 56
జనగామ 62
మహబూబాబాద్ 37
త్వరలో మరికొంత మంది..
పరస్పర బదిలీలపై హైకోర్టులో కేసు నడుస్తున్నది. ఈ కేసు ఈ నెల 18న విచారణకు రానున్నది. ఈ లోపు జీరో సర్వీస్కు అంగీకరించిన వారిని బదిలీచేయాలని విద్యాశాఖ అధికారులు నిర్ణయించారు. బదిలీల కోసం దరఖాస్తు చేసుకొని, జీరో సర్వీస్కు అంగీకారం తెలియజేస్తూ తాజాగా అండర్టేకింగ్ సమర్పిస్తే వారిని బదిలీచేస్తామని అధికారులు అంటున్నారు. ఈ నేపథ్యంలో త్వరలోనే మరికొంత మందిని బదిలీచేసే అవకాశాలున్నట్టుగా తెలుస్తున్నది.
Latest Updates
22 నుంచి డీఈఈసెట్ వెబ్ కౌన్సెలింగ్
ఎన్హెచ్ఎం పరిధిలో కాంట్రాక్టు ఉద్యోగాలు
బార్క్లో ఉద్యోగ అవకాశాలు
గెయిల్లో 282 ఖాళీలు
Learn about crucial events that took place in the past
All about the peasant movement of Telangana
కానిస్టేబుల్ ప్రిలిమ్స్ మోడల్ టెస్ట్ -2022
స్వయంచోదిత నాడీ వ్యవస్థ ఎందుకు తోడ్పడుతుంది? (బయాలజీ)
ముసునూరి నాయకులు- విమోచనోద్యమ కర్తలు (తెలంగాణ హిస్టరీ)
ఎంఎస్ఎంఈలో కాంట్రాక్టు ఉద్యోగాలు