విద్యార్థులకు 362.88 కోట్ల స్కాలర్షిప్లు
ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, దివ్యాంగులు, మైనార్టీ విద్యార్థులకు సంబంధించి రూ.362.88 కోట్ల ఉపకార వేతనాలను విడుదల చేయాలని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం నగరంలోని అరణ్యభవన్లో ఉపకార వేతనాల విడుదలపై ఆయన సమీక్షించారు. గత ఆర్థిక సంవత్సరంలో మార్చి 31లోపు ఆరు శాఖల నుంచి రావాల్సిన ఉపకార వేతనాలను వెంటనే రిలీజ్ చేయాలని చెప్పారు. ఆయా శాఖల్లోని కొన్ని బిల్లులు సకాలంలో అందలేదని, దాంతో వాటిని తిరిగి పంపినట్టు అధికారులు మంత్రికి వివరించారు. బిల్లులను ట్రెజరీ అధికారులు వెంటనే క్లియర్ చేయాలని హరీశ్రావు ఆదేశించారు. 2021-22 సంబంధించి ఉపకారవేతనాల బీఆర్వోలను విడుదల చేయాలని తెలిపారు.
Previous article
మరో 532 టీచర్ల పరస్పర బదిలీలు
Next article
ఆగస్టు 7న ఎస్సై ప్రిలిమ్స్
RELATED ARTICLES
Latest Updates
కణ బాహ్య జీర్ణక్రియ
అంతర్జాతీయ దినరేఖ ఏ జలసంధి గుండా పోతుంది?
ఒకే రకం భౌతిక లక్షణాలు.. సామాజిక సమూహాలు
గురుకులాలు.. ఉపాధికి మార్గాలు
CABE నివేదిక.. యుద్ధానంతర ప్రణాళిక
విస్తృత స్థాయిలో అంగీకారం, పార్టీల సంప్రదింపుల కోసం ఏర్పాటు చేసిన కమిటీ?
పలాసియోస్కు కిరీటం.. ‘తొలి తల్లి’ మిచెల్ కోన్
అయస్కాంత బలరేఖలు ఎక్కడ ప్రారంభమై ఎక్కడ అంతమవుతాయి?
పార్లమెంట్ సభ్యులు .. ప్రజలకు బాధ్యులు
తెలంగాణ జనసభ ఏ పేరుతో ర్యాలీలు, సదస్సులు నిర్వహించింది?